ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం మరియు కార్తీక మాసం వనభోజనాలు

Published: Tuesday November 22, 2022

చౌటుప్పల్,  నవంబర్ 21 (ప్రజాపాలన ప్రతినిధి):చౌటుప్పల్ మండలం ఆర్యవైశ్య మండల కమిటీ ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు ఘనంగా జరిగాయి కార్తీక మాసంలో ఈరోజు మండలంలోని ఆర్యవైశ్యులందరూ కలసి ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం మరియు కార్తీక వనభోజనాలు. జరిపారు ఈ వనభోజనాల కార్యక్రమానికి ఎమ్మెల్సీ దయానంద్, ముఖ్యఅతిథిగా వచ్చి కార్తీక వనభోజనాలు ప్రారంభించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ మండలంలోని ఆర్యవైశ్యులు అందరూ ఒక దగ్గర కలిసి ఈ కార్తీక మాసంలో వన భోజనాలు చేయడం సంతోషంగా ఉంటుందన్నారు ఆర్యవైశ్యులు అందరూ కుటుంబ సమేతంగా ఒకచోట చేరి ఆత్మీయంగా ఒకనొక పలకరించుకుంటూ భోజనాలు చేసే కుటుంబాలు సంతోషంగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షుడు మలగోడి శీను, ఆర్యవైశ్య మండల కమిటీ అధ్యకులు కాంశెట్టి చంద్రశేఖర్ గుప్తా, మున్సిపాలిటీ అధ్యక్షులు పాలడుగు వెంకటేష్ మంచి కంటి జనార్ధన్, మంచి కంటే భాస్కర్, నాంపల్లి శ్రీనివాస్, దాచేపల్లి శ్రీనివాస్, దాచేపల్లి రాజు, దాచేపల్లి విజయ్, మంచి కంటి వెంకన్న కామశెట్టి ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.