ఈపాస్ లేని వాహనాలను అనుమతించం : రూరల్ ఎస్ఐ రమేష్ కుమార్
Published: Tuesday June 15, 2021
మధిర, జూన్ 14, ప్రజాపాలన ప్రతినిధి : రూరల్ లాక్ నిబంధన ప్రకారం ఆంధ్రా నుంచి వచ్చే వాహనాలకు ఈపాస్ లేకుంటే తెలంగాణ లోకి అనుమతి లేదని రూరల్ ఎస్ఐ రమేష్ కుమార్ పేర్కొన్నారు సోమవారం మధిర మండలం లోని మాటూర్ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న ఆంధ్ర సరిహద్దు చెక్ పోస్ట్ మాన్ పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధిరలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల మధిరకు లాక్ డౌన్ లో సడలింపు దక్కలేదని ఆయన తెలిపారు. ప్రజలందరూ లాక్ డౌన్ నిబంధనలను పాటించాలన్నారు. ఖమ్మం సిపి విష్ణు వారియర్ ఆదేశాల మేరకు వైరా ఏసిపి సత్యనారాయణ ఆధ్వర్యంలో మధిర సిఐ మురళి పర్యవేక్షణలో మధిర రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో లాక్ డౌన్ ను పగడ్బందీగా అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కరోనా రక్షణ చర్యల్లో భాగంగా, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలకు ప్రజలు మద్దతుగా నిలవాలని ఆయన కోరారు.
Share this on your social network: