కేటీఆర్ బృంద సభ్యుడు సత్యనారాయణకు వికారాబాద్ అభివృద్ధి చిట్టా

Published: Wednesday December 07, 2022
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 6 డిసెంబర్ ప్రజా పాలన : వికారాబాద్ ప్రాంతం అభివృద్ధికి కావలసిన ప్రతిపాదనలను సిద్ధం చేసి  కేటీఆర్ బృంద సభ్యుడు సత్యనారాయణకు అందజేశామని చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ అన్నారు. మంగళవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని కేటీఆర్ బృంద సభ్యులు సిడిఎంఏ సత్యనారాయణ, ఈఅండ్ సి శ్రీధర్, జాయింట్ డైరెక్టర్ రమేష్ బాబు లు పలు ప్రాంతాలను చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తో కలిసి క్షేత్రస్థాయిలో పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతగిరి ఆలయ అభివృద్ధి, అనంతగిరి పర్యాటక కేంద్రం మెడికల్ కళాశాల నిర్మాణం అంశాలు.
మన్నెగూడ నుండి అనంతగిరి వరకు, బి జె ఆర్ చౌరస్తా నుంచి కొత్తగడి వరకు, బి జె ఆర్ చౌరస్తా నుండి బుగ్గ వరకు, ఎన్నేపల్లి నుంచి మద్గుల్ చిట్టెంపల్లి వరకు రోడ్లు, ప్రధాన కూడల్ల నిర్మాణం బ్లాక్ గ్రౌండ్ లో సౌకర్యాలు, శివారెడ్డి పెట్ చెరువు మినీ ట్యాంక్ బండ్  నిర్మాణం తదితర అంశాలను వికారాబాద్ కు కావలసిన అభివృద్ధి నివేదికలను తయారు చేస్తున్నామన్నారు. ఇంత త్వరగా అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనకు పూనుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.