కోరుట్ల పరిధిలో అక్రమంగా ఇసుకను తరలిస్తే ట్రాక్టర్లను సీజ్ చేస్తాం - సి.ఐ రాజశేఖర రాజు
Published: Friday August 06, 2021
కోరుట్ల, ఆగష్టు 05 (ప్రజాపాలన ప్రతినిధి) : నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఇసుకను తరలిస్తే ట్రాక్టర్లను సీజ్ చేస్తామని కోరుట్ల సీఐ రాజశేఖర రాజు హెచ్చరించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇసుక అక్రమార్కులపై కఠినంగా వ్యవహరిస్తామని, ఎవరైనా ఇసుకను తరలిస్తూ పట్టుబడితే ట్రాక్టర్లు సీజ్ చేయడమే కాకుండా కేసులు నమోదు చేస్తామని తెలిపారు కోరుట్ల సర్కిల్ పరిధిలోని మేడిపల్లి, కథలాపూర్, కోరుట్ల పరిధిలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న నాలుగు ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేసినట్లు సి.ఐ రాజశేఖర రాజు తెలిపారు.
Share this on your social network: