మొలంగూర్ లో ఘనంగా అంబేద్కర్ జయంతి

Published: Saturday April 15, 2023

శంకరపట్నం ఏప్రిల్ 14 ప్రజాపాలన రిపోర్టర్:


శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో శుక్రవారం ఆకునూరి మహేందర్ ఆధ్వర్యంలో అంబేద్కర్ 132వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ అంబేద్కర్ సంఘ వ్యవస్థాపక సభ్యులు కనకం రమణయ్య, అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నినాదాలు చేశారు. అంబేద్కర్ జీవన విధానాన్ని, ఆయన భారతదేశానికి చేసిన సేవలను యువకులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కాలేషి సదానందం, యూత్ సభ్యులు కనకం సాయికుమార్, దాసరపు నరేష్, దాసారపు అజయ్, ఎల్కపల్లి అరవింద్, కాలేషి సమ్మయ్య, కాసర్ల రమేష్, మోరే రాజశేఖర్, దాసరపు మనోహర్, దాసరపు ఆనంద్, కాసర్ల రఘుపతి, గాజుల రామకృష్ణ, గాజుల కళ్యాణ్, కాలేషి ప్రేమ్ కుమార్, కుమ్మరి నరేష్, దాసరపు శివ స్వామి, కాలేషి రాకేష్ తదితరులు పాల్గొన్నారు.