అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాగిడి లక్ష్మారెడ్డి

Published: Thursday March 09, 2023
మేడిపల్లి, మార్చి8 (ప్రజాపాలన ప్రతినిధి) 
 ఉప్పల్ నియోజకవర్గం చిల్కానగర్ డివిజన్లో మధుర చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రం వద్ద నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో ముఖ్యఅతిథిగా మధుర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఉచిత కంప్యూటర్  శిక్షణ నేర్చుకుంటున్న మహిళలు ఆటపాటలతో సంతోషంగా గడపడం జరిగింది. ఈ సంస్కృతి వేడుకల్లో పాల్గొన్న చిన్నారులకు మధుర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాగిడి లక్ష్మారెడ్డి  నగదు బహుమానం ప్రధానం చేశారు. ఈ సందర్భంగా  రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ  ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు సంబరాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న మహిళా మణులు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, విధిరాతను ఎదిరించి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తూ ఎందరో నారీమణులు చరిత్రలో తమకంటూ ఓ స్థానాన్ని సాధించుకున్నారని తెలిపారు. 
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దాసరి కృష్ణ, బూర్గుల రమేష్ గౌడ్, మాజీ కౌన్సిలర్ రాజ్యలక్ష్మి ,మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వంజరి సంతోష్, బొల్లం లక్ష్మణ్, ఉప్పల్ ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ నరేష్, మధుసూదన్ రెడ్డి, శ్రావణ్ కుమార్, శ్రీనివాస్, పవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.