కామ్రేడ్ టి.ఎన్. వెంకటరమణ సంస్మరణ సభ
మంచిర్యాల టౌన్, అక్టోబర్ 14, ప్రజాపాలన :కామ్రేడ్ టి.ఎన్. వెంకటరమణ సంస్మరణ సభ తెలంగాణ ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం రోజున మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చార్వక హాల్ లో దుంపల రంజిత్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. అనంతరం ప్రజా సంఘాల ఉద్యమ నిర్మాత కామ్రేడ్ వెంకటరమణ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా పలు సంఘాల నాయకులు మాట్లాడుతూ టి.ఎన్. వెంకటరమణ సిర్పూర్ పేపర్ కంపెనీలో ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తూన్న సందర్బంలో ప్రజలు ఎదుర్కొంటున్నా సమస్యల పరిష్కారం కొరకు ప్రజలు చైతన్య వంతులుగా మార్చడం కొరకు తన ఉద్యోగాన్ని సైతం వదిలేసి, ప్రజల సమస్యలు అధ్యయనం చేస్తూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విద్యార్థి, యువజన, కార్మిక సిపిఎం పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు అని కొనియాడారు. ఈ మధ్య కాలంలో అనారోగ్య సమస్యల వలన ఆయన మరణించారు అని అన్నారు. ఆయన ఆశయాల కోసం పాటు పడాలని , ఆయన స్పూర్తితో జిల్లాలో ప్రజా సంఘాలను నిర్మాణం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు , సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సంకె రవి, సామాజిక న్యాయ వేదిక జిల్లా కన్వినర్ రంగు రాజేశం,తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: