గాంధీ మహాత్ముని స్పూర్తి తో యువత ముందుకు సాగాలని గాంధీ విగ్రహవిష్కరణ చేసిన పి.సుదర్శన్- సర్

Published: Tuesday June 28, 2022
పాలేరు నేలకొండపల్లి 27 ప్రజాపాలన ప్రతినిధి
జాతిపిత మహత్మ గాంధీ మార్గం ప్రతీ ఒక్కరికి అనుసరణీయమని వాసవి క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షుడు పి.సుదర్శన్ అన్నారు. నేలకొండపల్లి గ్రేటర్, వనిత భక్తరామదాసు సంయుక్త ఆధ్వర్యంలో కోనాయిగూడెం లో ఏర్పాటు చేసిన మహత్మగాంధీ విగ్రహం ను  ఆవిష్కరించారు. తొలుత గ్రామంలో కోలాటం. నృత్యాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నేటి తరం గాంధీ స్పూర్తి తో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆయన చూపిన మార్గంలో పయనించాలని సూచించారు. మారుమూల గ్రామంలో కూడ మహత్మ గాంధీ విగ్రహాలను ఆవిష్కరించుకోవటం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అనంతరం మండలం లో రాజేశ్వరపురం, నాచేపల్లి, నేలకొండపల్లి, వివిధ గ్రామాల్లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా గవర్నర్ సుజాత, సర్పంచ్ పెంటమళ్ల పుల్లమ్మ, ఎంపీటీసీ " లు రేగూరి వాసవి, దోసపాటి కల్పన, ఉప సర్పంచ్ వడ్లమూడి నర్సయ్య. వాసవి క్లబ్ ప్రతినిధులు రేగూరి హనుమంతరావు, దోసపాటి శేఖర్, 
దోసపాటి రామకృష్ణ, ఈగ అనిల్ కుమార్, 
పెద్దలు తదితరులు పాల్గొన్నారు.