రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేతలు

Published: Monday June 28, 2021
బాలపూర్, జూన్ 27, ప్రజాపాలన ప్రతినిధి : భారతదేశం కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ ఆదేశానుసారంగా తెలంగాణ రాష్ట్ర రథసారథిగా పీసీసీ అధినాయకుడిగా నియామక పత్రాన్ని అందజేసిన  సందర్భంగా రంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఉత్సాహాలు కెరటాలలో మునిగి తేలుతూ.... పీఠాన్ని అధిరోహించిన మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. డీసీసీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి, పీసీసీ సెక్రటరీ జానకి రామ్, ఏనుగు జంగారెడ్డి, కందుకూరు అధ్యక్షులు క్రిష్ణ నాయక్, ఢిల్లీ శ్రీధర్, డిసీసీ సెక్రెటరీ దేవగోని కృష్ణ, మీర్ పేట్ కార్పొరేషన్ కార్పొరేటర్ భర్త చల్లా బాల్రెడ్డి కార్పొరేటర్ సిద్దల శ్రీశైలం, ఐ ఎన్ టి యు సి సామ భాస్కర్ రెడ్డి, సుభాష్ రెడ్డి, నరేష్, నవీన్ కుమార్, అఖిల్, మీర్ పేట్ కార్పొరేషన్ యువజన అధ్యక్షులు అయితరాజు భాస్కర్ పాల్గొన్నారు.