దివ్యాంగుల భవితకు కొండంత అండ టిఆర్ఎస్ ప్రభుత్వం

Published: Wednesday February 16, 2022
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 15 ఫిబ్రవరి ప్రజాపాలన : దివ్యాంగుల భవితకు కొండంత అండగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుందని టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ పట్టణంలోని క్లబ్ ఫంక్షన్ హల్ లో తెలంగాణ ప్రభుత్వం వికలాంగులకు అందిస్తున్న ఉచిత సహాయ ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నడవలేనివారిని తెలంగాణ సర్కారు నడిపిస్తున్నదని అంధులకు దారి చూపిస్తూ వినికిడి లోపం ఉన్నవారికి వినిపించేలా సహకరిస్తున్నదని, అర్హులైన దివ్యాంగులకు త్రిచక్ర మోటర్‌ బైక్‌లు, వీల్ చైర్స్, స్మార్ట్‌ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర పరికరాలు అందజేస్తుందన్నారు. దివ్యాంగులకు నెలనెలా తెలంగాణ సర్కారు రూ. 3016 చొప్పున ఆసరా పింఛన్లు అందిస్తున్నదని, దివ్యాంగుల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.