బిజెపి పార్టీ నుండి సిపిఎం పార్టీ లోకి వలసలు

Published: Friday September 17, 2021
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 16, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మంచాల మండల పరిధిలోని చెన్నారెడ్డి గూడ గ్రామంలో బిజెపి పార్టీ గ్రామ అధ్యక్షులు జొన్నలగడ్డ రమేష్ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పగడాల యాదయ్య ఆధ్వర్యంలో సిపిఎం పార్టీలోకి చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి పగడాల వెంకటేష్ శాఖ కార్యదర్శులు బెల్లి పాండు, బాణావత్ శ్రీను, ఆర్ స్వామి, 8వ. వార్డు మేంబర్ దేవసొత్ రాములు, డివైఎఫ్ఐ మండల కార్యదర్శి ఆర్ స్వామి డివైఎఫ్ఐగ్రామ కార్యదర్శి పగడాల ప్రహ్లాద్ పార్టీ నాయకులు పి. కృష్ణ, దేవసొత్ లచ్చిరాం, ఉప్పాల రాములు డివైఎఫ్ఐ గ్రామ నాయకులు ఎర్ర విక్రమ్ మంచార్ల క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.