నల్లగొండ ఆలయం లో నూతన గదిని ప్రారంభించిన జెడ్పిటిసి

Published: Tuesday November 23, 2021

కొడిమ్యాల, నవంబర్ 22 (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం లొని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం నల్లగొండలో భక్తుల సౌకర్యార్థం కీర్తిశేషులు పైడిపల్లి ఊర్మిళాదేవి జ్ఞాపకార్థం గా వారి కుమారుడు పైడిపల్లి రామ్మోహన్ రావు- హరిత దంపతులు  నాచుపల్లి గ్రామస్తులు 6,50,000 రూపాయలు వారి సొంత డబ్బులతో గది ని నిర్మించగా సోమవారం జెడ్పిటిసి  పునుగోటి ప్రశాంతి చేతుల మీదుగా  ప్రారంభించారు.అనంతరం ఆలయ చైర్మెన్ చెన్నాడి సత్యనారాయణ రావు, ఈ ఓ కాంతారెడ్డి, లకు నిర్మాణం పూర్తి అయిన గది ని అప్పగించారు. ఆలయ ప్రదాన అర్చకులు గది నిర్మాణం చేసిన దంపతులకు మంగళ శాసనాలు తెలిపారు.