మాలీలను ఎస్ టి జాబితాలో చెర్చాలి

Published: Tuesday September 20, 2022
మంచిర్యాల టౌన్, సెప్టెంబర్ 19, ప్రజాపాలన:  మాలీలను ఎస్ టి జాబితాలో చెర్చాలని తెలంగాణ రాష్ట్ర మహాత్మ జ్యోతిబా ఫూలే మాలీ సంక్షేమ సంఘం,  ఆధ్వర్యంలో మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు లెండుగురె శ్యాంరావు  మాట్లాడుతూ  తేదీ.2017 ఏప్రిల్ 04 న  గిరిజనుల రిజర్వేషన్ ను 10శాతానికి పెంచుతూ అందులో మాలీ కులస్థులకు చోటు కల్పిస్తూ కేంద్రానికి బిల్లు పంపడం జరిగిందని, రాష్ట్ర ముఖ్యమంత్రి కె సి ఆర్  అసెంబ్లీ సాక్షిగా మాలీలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటే 10 శాతానికి పెంచుతున్న గిరిజన రిజర్వేషన్ జి ఒ లో మాలీలను కలుపుతూ మాలీలకు ఎస్టీ హోదా కల్పించి సామాజిక న్యాయం చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదె వసంత్ రావు, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు సెండె సత్యనారాయణ, రాష్ట్ర కమిటీ సభ్యులు వడై మోతేరావు, జిల్లా నాయకులు నెండుగూరి మధు, సెండె కొండన్న, బాపురావు, కాగజ్ నగర్ మండల అధ్యక్షులు కొట్రంగె నాందేవ్, జిల్లా యువజన సంఘం ప్రధాన కార్యదర్శి నెండుగూరి సంతోష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.