జాతీయ సమైక్యత వారోత్సవాలు అందరం కలిసి విజయవంతం చేయాలిఅడిషనల్ లా అండ్ ఆర్డర్ డిసిపి

Published: Thursday September 15, 2022
ఏ ఎస్ సి బోస్ మధిర సెప్టెంబర్ 14 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు జాతీయ సమైక్యత వార్షికోత్సవం భాగంగా అందరూ భాగస్వాములై విజయవంతం చేద్దాం స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం లో బుధవారం నాడు మధిర సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అడిషనల్ లా అండ్ ఆర్డర్ డిసిపి బోస్ సందర్భంగా వారు మాట్లాడుతూ మాట్లాడుతూ  ప్రభుత్వ ఆదేశానుసారం 16, 17, 18 తేదీల్లో జరిగే జాతీయ సమైక్యత ఉత్సవాలను మధిరలో ఘనంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. దీనికోసం నియోజకవర్గంలో అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులతో, అసోసియేషన్స్ తో, గ్రామ సర్పంచ్ మరియు సంబంధిత అన్ని శాఖల అధికారులతో మాట్లాడి విజయవంతం చేయాల్సిందే కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ మురళి, ఆర్డీవో ఖమ్మం రవీందర్ నాథ్, టౌన్ రూరల్ ఎస్సైలు సతీష్ కుమార్ నరేష్  పాల్గొన్నారు.
 
 
 
Attachments area