పలు అభివృద్ధి నిర్మాణ పనులకు శంకుస్థాపన

Published: Friday December 03, 2021
ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేది 2 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడ గ్రామంలో సర్పంచ్ బూడిద రామ్ రెడ్డి అధ్యక్షతన గ్రామ పంచాయతీ సాధారణ సమావేశం గురువారం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేసి ఆమోదించడం జరిగింది. అనంతరం వాటర్ ప్లాంట్ ఆవరణలో సర్పంచ్ బూడిద రామ్ రెడ్డి పౌండేషన్ ఆధ్వర్యంలో రామ్ రెడ్డి సొంత నిధులతో పల్లె దవాఖాన నిర్మాణం మరియు పార్కుస్థలం లో పశు వైద్యశాల నిర్మాణం కొరకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీపీ కృపేష్ మరియు ఎంపీడీవో మహేష్, వార్డు సభ్యులు గ్రామ పెద్దల సమక్షంలో భూమి పూజ నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో ఉపసర్పంచ్ బూడిద నరసింహారెడ్డి, వార్డు సభ్యులు పద్మమ్మ, శ్రీ వేణి, లలిత, శశిరేఖ, కో ఆప్షన్ సభ్యులు గోపాల్ సురేందర్ రెడ్డి,  కార్యదర్శి రిషిక నేత, కారోబార్ నరసింహ్మ పాల్గొన్నారు.