సోలార్ విద్యుత్ కంచె ను ప్రారంభించిన గోపిశెట్టి
Published: Friday October 28, 2022
తల్లాడ, అక్టోబర్ 27 (ప్రజాపాలన న్యూస్):
తల్లాడ పట్టణంలోని గొల్లగూడెం వెళ్లే రహదారిలో ఉన్న శ్రీరామలింగేశ్వరస్వామి శివాలయంకు సోలార్ విద్యుత్ కంచె ఏర్పాటుచేశారు. దాతలు తల్లాడకు చెందిన టిఆర్ఎస్ నాయకులు గోపిశెట్టి వెంకటేశ్వర్లు కుమారుడు సుశ్రుత్ కుమార్, గురజాల రామకృష్ణారావు (కృష్ణయ్య) కుటుంబసభ్యులు సుమారు లక్ష రూపాయలు అందించారు. వీటితో ఏర్పాటు చేసిన కంచెను గురువారం తెరాస నాయకులు గోపిశెట్టి వెంకటేశ్వర్లు, లాయర్ గురిజాల సీతారామచంద్ర రావు చేతులమీదుగా ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆలయానికి వచ్చే భక్తులు కోతులు బెడదతో భయపడుతున్నారని తెలిపారు. ఈ విషయాన్ని ఆలయ కమిటీ నిర్వాహకులు వేమిశెట్టి నాగన్న తమ దృష్టికి తీసుకురావడంతో స్పందించి లక్ష రూపాయల నగదును అందించినట్లు తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ పెద్దలు వేమిశెట్టి నాగన్న, నంబూరి మోహన్ రావు, కేతేపల్లి భాస్కరరావు, బొజ్జ నరసింహారావు, సరికొండ హరీష్ రాజు, అనుమోలు సర్వేశ్వరరావు, గుంటుపల్లి వెంకటయ్య, అనంతరామయ్య, రాయల తిరుమలయ్య, రామకృష్ణ, వేమిశెట్టి వెంకటేశ్వరరావు, వేమిశెట్టి చంద్రం, వార్డు మెంబర్ రఘు, తొండపు వెంకటకృష్ణ, పూజారి నుదురుపాటి ప్రసాద్ శర్మ, మణికంఠ, కంచల సతీష్ శర్మ తదితరులు ఉన్నారు
Share this on your social network: