టియస్ యుటియఫ్ బోనకల్ మండల కమిటపాత జిల్లాల ప్రకారమే బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ ప్రకటించాలి :

Published: Tuesday July 27, 2021
బోనకల్లు, జులై 26, ప్రజాపాలన ప్రతినిధి : ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు ప్రస్తుతానికి పాత జిల్లాల ప్రాతిపదికన యాజమాన్యాల వారీగా నిర్వహించాలని టియస్ యుటియఫ్ బోనకల్ మండల ప్రధాన కార్యదర్శి గుగులోత్. రామకృష్ణ డిమాండ్ చేశారు. టియస్ యుటియఫ్ మండల కమిటీ సమావేశం సోమవారం నాడు టిఎస్ యుటిఎఫ్ మండల  అధ్యక్షులు కంభం. రమేష్  అధ్యక్షతన బోనకల్ లో జరిగింది. ఈ సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ అనేక పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్లు లేక విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని, ఆరేళ్ళ నుంచి పదోన్నతులు లేకపోవడంతో విద్యారంగం సంక్షోభంలో ఉందని, ఎనిమిది ఏండ్ల నుంచి అంతర్జిల్లా బదిలీలు చేపట్టకపోవడంతో బార్యాభర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం వెంటనే బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. పిఆర్సీలో పలు అసంబద్దతలున్నాయని, మాస్టర్ స్కేలును సవరించి ఉపాధ్యాయులు అందరికీ న్యాయం చేయాలని, కెజిబివి సిబ్బందికి మినిమం టైంస్కేలు ఇవ్వాలని ఉద్యోగ విరమణ పొందిన ఉపాధ్యాయుల పెన్షనరీ క్లైములు, జిపిఎఫ్, సెలవు జీతాలు, మెడికల్ రీయింబర్స్మెంట్, సిపియస్ ఉపాధ్యాయుల డిఎ బకాయిలు తదితర క్లైములన్నీ ఆరు నెలలుగా ఆర్థిక శాఖ వద్ద పెండింగ్ లో ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని మండల అధ్యక్షులు రమేష్ డిమాండ్ చేశారు. టివి పాఠాలు విద్యార్థులను ఆకట్టుకోవటం లేదని, ఆన్లైన్ విద్య అందరికీ అందుబాటులో లేదని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్న విధంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తగిన జాగ్రత్తలతో పాఠశాలల్లో దశలవారీగా ప్రత్యక్ష బోధనను ప్రారంభించాలని సమావేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ సమావేశంలో నాయకులు యంసిఆర్ చంద్రప్రసాద్, ఆలస్యం. పుల్లారావు, పి.సుశీల, బి.ప్రీతమ్, పి.గోపాల్ రావు, కె.రమేష్కె. సౌబాగ్యలక్ష్మి, కె.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.