మెగా లోక్ అదాలత్ ను విజయవంతం

Published: Monday May 30, 2022

చేయాలిమధిర  మే 28 ప్రజా పాలన ప్రతినిధి దేశ వ్యాప్తంగా జూన్ 26న నిర్వహిస్తున్న మెగా జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని మధిర కోర్టు జూనియర్ సివిల్ జడ్జి డి.ధీరజ్ కుమార్ కోరారు శనివారం మధిర కోర్టులో మెగా లోక్ అదాలత్ పై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ కుమార్  మాట్లాడుతూ పోలీసులు, న్యాయవాదులు  అందరూ మెగా లోక్ అదాలత్ కు సహకరించి సాధ్యమైనన్ని ఎక్కువ కేసులు పరిష్కారం కావటానికి తోడ్పడాలని ఈ సందర్భంగా  వ్యాఖ్యానించారు.  సన్నాహక సమావేశంలో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి నాగలక్ష్మి, భద్రయ్య  మధిర  సర్కిల్ ఇన్స్పెక్టర్ ఓ. మురళి ట్రైనీ ఐపీఎస్ సంకీర్త్ అన్ని పోలీస్ స్టేషన్లో సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్లు , వైరా ఎక్సైజ్ సీఐ రమ్య రెడ్డి సీనియర్ న్యాయవాదులు వాసంశెట్టి కోటేశ్వరరావు, కావూరి రమేష్, సతీష్ సూపరింటెండెంట్ వెంకన్న, స్వప్న లీగల్  సెల్ బాధ్యులు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.