ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ కూసుమంచి మండల కమిటీ ఎన్నిక..

Published: Wednesday November 24, 2021
పాలేరు నవంబర్ 23 ప్రజాపాలన ప్రతినిధి : ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ కూసుమంచి మండల నూతన కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కూసుమంచి మండలానికి చెందిన మాలోతు వెంకన్న నాయక్ మరియు భూక్య రఘు నాయక్ లు నియమితులయ్యారు. AIBSS జిల్లా కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ధరావత్ రామ్మూర్తి నాయక్ ఈ మేరకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాలోతు వెంకన్న నాయక్ భుక్యా రఘు నాయక్ లు మాట్లాడుతూ గిరిజన హక్కులు వాటి సాధనకై పోరాటాలు సాగిస్తూ, గిరిజన జాతి ఆర్థిక, సామాజిక మనుగడకై కృషి చేస్తామని, సంఘం బలోపేతానికి పాటుపడతానని అన్నారు. తమ మీద నమ్మకం ఉంచి ఎన్నుకున్న జిల్లా, రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బస్కీ నాయక్, సేవ నాయక్, తిరుమలాయపాలెం అధ్యక్షుడు గణేష్ నాయక్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.