రాష్ట్రపతి పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు.. సకలం సిద్ధం.... చేసిన అధికార యంత్రాంగం.. చక్రబంధంలో భద్ర

Published: Wednesday December 28, 2022
బూర్గంపాడు (ప్రజా పాలన.)
 28నరాష్ట్రపతి  ముర్ము  భద్రాద్రి రాకతో ప్రభుత్వ యంత్రాంగం సర్వం సిద్ధం చేశారు. అందులో భాగంగానే సారపాక నుండి భద్రాచలానికి అధికారులు కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని బుధవారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకొనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం అధికారులు రాష్ట్రపతి కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు. తొలుత బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ స్కూల్లో ఏర్పాటు చేసిన హెలీపాడ్ నుంచి కాన్వాయ్ బయలుదేరి ఐటీసీ గెస్ట్ హౌసుకి అక్కడి నుంచి భద్రాచలం రామాలయానికి ట్రయల్ రన్ ను విజయవంతంగా నిర్వహించారు..