అంకమ్మ ఆలయంలో అన్నదానం ప్రారంభం
Published: Tuesday April 19, 2022
తల్లాడ, ఏప్రిల్ 18 (ప్రజాపాలన న్యూస్): తల్లాడ మండల పరిధిలోని అన్నారుగూడెంలో అంకమ్మ జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని తహశీల్దార్ గంట శ్రీలత, ఎస్సై సురేష్, ఎంపీడీవో రవీంద్రారెడ్డి సోమవారం ప్రారంభించారు. తొలుత అంకమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుడి యొక్క ప్రాముఖ్యతను గురించి ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ దిరిశాల ప్రమీల, దాసురావు, వీర మోహన్ రెడ్డి, దుగ్గిదేవర వెంకట్ లాల్, కొమ్మినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: