వెంకటాపురంలో గోపాలరావు ఆధ్వర్యంలో వనసమారాధాన.
Published: Monday November 21, 2022
తల్లాడ, నవంబర్ 20 (ప్రజాపాలన న్యూస్):
తల్లాడ మండలంలోని వెంకటాపురం గ్రామంలో ఆదివారం సకలజనుల సామూహిక వన సమారాధన నిర్వహించారు. స్థానిక టిఆర్ఎస్ నేత ఏరువా గోపాలరావు ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటుచేశారు. సత్తుపల్లి టిఆర్ఎస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ఇటువంటి వన సమారాధన నిర్వహించాలని కోరారు. అనంతరం సత్యవతి 20 చీరలను, 4 పంచెలను గ్రామస్తులకు అందించారు. ఈ కార్యక్రమంలో తెరాస సీనియర్ నాయకులు జక్కంపూడి కృష్ణమూర్తి, గోపిశెట్టి వెంకటేశ్వర్లు, ఇమ్మనేని ప్రసాద్ రావు, దొడ్డా శ్రీనివాస్ రావు, దుపాటి సత్యవతి, పొట్రూ శ్రీను, ముత్తుకొరి మల్లాచారి, కోటేశ్వరరావు, నాలవెల్లి వెంకటేశ్వర రావు, షేక్ యాకుబ్ పాషా, షేక్ మౌలాలి, భద్రయ్య, ఎరువా రామారావు, షేక్ అక్బర్, సరికొండ హరీష్ రాజు పాల్గొన్నారు.
Share this on your social network: