సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

Published: Friday August 05, 2022

మధిర  ఆగస్టు 4 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నాడు ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని దెందుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు శశిధర్ పేర్కొన్నారు. గురువారం మధిర మున్సిపాలిటీ పరిధిలో పలు వార్డుల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఈ సందర్భంగా ఆయన కోరారు. విష జ్వరాలు సోకకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో  వైద్య సిబ్బంది పాల్గొన్నారు.