ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే 131వ వర్ధంతి వేడుకలు

Published: Monday November 29, 2021
కాగజనగర్, నవంబర్ 28, ప్రజా పాలన ప్రతినిధి : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మనేపల్లి మండలం డబ్బా బరెగుడ గ్రామంలో మాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పితామహుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే 131 వర్ధంతి సందర్భంగా జ్యోతిబాపూలే సావిత్రిబాయి పూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి జెండా ఆవిష్కరించారు. గ్రామస్తులందరూ కలిసి ఆరాధ్యదైవమైన మహాత్మ జ్యోతిబాపూలే కు గ్రామస్తులందరూ ఘన నివాళులు అర్పించరు మాలి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. మాలి సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు నికొడే బాపురవు మాట్లాడుతూ మహనీయుల బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. పూణేనగరంలో పుట్టినటువంటి మహానుభావుడు పితామహుడు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే 131 వర్ధంతి సందర్భంగా జ్యోతిబాపూలే సావిత్రిబాయి పూలే అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి జెండా ఆవిష్కరించారు. గ్రామస్తులందరూ ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీల ఆరాధ్యదైవమైన మహాత్మ జ్యోతిబాపూలే కి ఘన నివాళులు అర్పించడం జరిగింది అని అన్నారు మహనీయుల బాట ను ప్రతి ఒక్కరూ నడవాలని వారి అడుగుజాడల్లో ముందు తరం ముందడుగు అవుతున్న సందర్భంగా వాళ్ళ యొక్క ఆశయసాధనకు ప్రతి ఒక్కరు కృషి చేసి పూలే వర్ధంతిని అధికారికంగా ఉద్యోగపరంగా సామాజికంగా నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు గుర్లే శ్రీనివాస్ తాకితే బాపు రావు మండల యూత్ ప్రధాన కార్యదర్శి నికొడే సందీప్ గ్రామ యూత్ అధ్యక్షుడు వాడాయి గణపతి కుల పెద్దలు మార్లే శ్రీనివాస్ శంకర్ వడెయ్ శ్రీనివాస్ మాలి సంక్షేమ సంఘం సభ్యులు గ్రామస్థులు యువకులు సైతం మరియు మహిళలు  పాల్గొని విజయవంతం చేశారు.