కరోన బాధితులకు అండగా గణేష్ కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం

Published: Friday May 21, 2021
మధిర, మే 20, ప్రజాపాలన ప్రతినిధి : కొవిడ్ పేషెంట్లకు ఉచితంగా అందించే భోజనాన్ని ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు.కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కొంతమంది పేషెంట్లు భోజన సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్న సందర్భంలో మేమున్నాం అండగా అంటూ శ్రీ గణేష్ కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం తేళ్ల వాసు, ఈదర సుబ్బారావు ఆధ్వర్యంలో కరోనా బాధితులకు ఉచిత భోజన సౌకర్యాన్ని ఈరోజు నుంచి అందిస్తున్నారు. ఈ ఉచిత భోజన కార్యక్రమాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ అవకాశాన్ని కరోనా బాధితులు సద్వినియోగం చేసుకోవాలని ఇతర గ్రామాల వారు మీ గ్రామ సర్పంచి ద్వారా తెలియజేయాలని సూచించారు. ఈ రోజు సుమారు వంద భోజన ప్యాకెట్లను కరోనా బాధితులకు అందజేసినట్లు గణేష్ కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం పేర్కొంది.