సాధికారిత పేరుతో దళితులను మోసం చేస్తున్న కేసిఆర్.

Published: Wednesday June 30, 2021

యంసిపిఐ (యు) మంచిర్యాల జిల్లా కార్యదర్శి సబ్బని కృష్ణ
బెల్లంపల్లి, జూన్ 29, ప్రజాపాలన ప్రతినిధి : ఎస్సీ ఎస్టీ ల సాధికారిత పేరుతో దళితులను ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేస్తున్నారని మం సిపిఐ (యు) మంచిర్యాల జిల్లా కార్యదర్శి సబ్బని కృష్ణ  విమర్శించారు. మంగళవారం బెల్లంపల్లి పట్టణం లోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో దళితులకు ఎన్నో వాగ్దానాలు చేసి ఓడ్డెక్కేదాకా ఓడ మల్లప్ప ఒడ్డెక్కాక బోడి మల్లప్పఅన్నట్లుగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూములు ఇస్తామని ఇవ్వలేదని గుర్తు చేశారు. ఇంటికో ఉద్యోగం కలగానే మిగిలి పోయిందని అన్నారు. దళితుల కోసం ఇచ్చిన వాగ్దానాలు చెత్త బుట్టలో పడ్డాయని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి పాలనపై, కేసీఆర్ పై ప్రజల్లో అసంతృప్తి తీవ్ర స్థాయిలో ఉందని మళ్ళీ మాయ మాటలతో ప్రజలను బోల్తా కోట్టించడానికి మాటల గారడి చేస్తున్నాడని విమర్శించారు. ముఖ్యమంత్రికి అధికార దాహం డబ్బు తప్ప దళితుల పట్ల నిజమైన ప్రేమ లేదని, సవితి తల్లి ప్రేమ మాత్రమే చూపిస్తున్నాడని పేర్కొన్నారు. అగ్రవర్నాల కుట్రలను, కుతంత్రాలను దళితులంతా, తెలంగాణాలోని అన్ని వర్గాల ప్రజలంతా  గమనిస్తున్నారని, కేసిఆర్ అవలంబిస్తున్న ఈ విధానాలను ఎంసిపిఐ (యు) పార్టీ తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆరేపల్లి రమేష్, ధరావత్ బాలు నాయక్, అంబాల రాజు, దుర్గం వీరయ్య, సతీష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.