పట్టభద్రులూ, ఆలోచించి ఓటు వేయండి

Published: Friday February 26, 2021
ఎమ్మెల్సీ ఎన్నికలు వేరు.. సాధారణ ఎన్నికలు వేరు.. మొదటి ప్రాధాన్యత ఓటు అంటే ఏంటీ తెలుసుకోండి
మధిర ఫిబ్రవరి 25 ప్రజాపాలన ప్రతినిధి: ప్రస్తుతం జరగనున్న ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలోని పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలి
ఎమ్మెల్సీ ఎన్నిక: పట్టభద్రులు అంటే డిగ్రీ పూర్తి చేసుకున్న వారు. డిగ్రీ పూర్తి చేసుకుని 3 సంవత్సరాలై యుండాలి. అలాంటి పట్టభద్రులే ఓటుహక్కు కు అర్హులు. ఉద్యోగం చేస్తున్నవారు, నిరుద్యోగులు కూడా ఓటు వేయవచ్చు. 
సాధారణంగా ఎన్నికలలో మనం మనకు నచ్చిన అభ్యర్థికి మాత్రమే ఓటు వేస్తాం, కేవలం ఆ అభ్యర్థి ఒక్కరికే కాకుండా మరొకరికి కూడా ఓటు వేస్తే చెల్లుబాటు కాకుండా పోతోంది అక్కడ.... ఎమ్మెల్సీ ఎన్నికలలో మాత్రం ఓటు వేసే ప్రక్రియ మాత్రం భిన్నంగా ఉంటుంది.
ఇక్కడ మనం మనకు కావలసిన అభ్యర్ధికి మాత్రమే కాకుండా మరొకరికి కూడా ఇంకో  ఓటు వేయవచ్చు. పోటీలో ఎంతమంది ఉంటే అంత మందికి ఓటు వేయవచ్చు.
ఇలాంటి విధానంలో మన ఓటు ఎవరికీ ఎలా వేసుకోవాలి.. ? మనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేయాలంటే.. ? ఈ ప్రశ్నలకు ఒక్కటే సమాధానం. ఈ ఎం.ఎల్.సి ఎన్నికల విధానం గురించి తెలుసుండాలి. ఇపుడు ఈ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల కర పత్రాలలో చూసే ఉంటారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు వేసి గెలిపించాలని  ప్రతి అభ్యర్ధి కోరడం గమనించే ఉంటారు.
(మొదటి ప్రాధాన్యత ఓటు అంటే, మనకు నచ్చిన అభ్యర్థికి మొదట ఓటు వేయడ స్... ఇంకో  అభ్యర్థికి  (నెంబరు/number) ఓటు వేయవచ్చు. ఇంకో అభ్యర్థికి 3 (నెంబరు) ప్రాధాన్యత ఓటు వేయవచ్చు అన్నమాట. ఓ 20 మందీ బరిలో ఉంటే, వరుసగా ... వారి పేర్లు ఉండగా, మనకు నచ్చిన అభ్యర్ధి వరుసలో పేరు పక్కన / బ్యాలెట్ పేపర్ లో నిర్దేశించబడిన  స్థలంలో ఓటు వేయవచ్చు... 20 మంది 30 మంది అభ్యర్థులు ఉన్నాసరే, ఉదాహరణకు వరుసలో నెంబర్ 12 లో ఉంటే అక్కడ  నెంబర్  1 వేస్తే అది మొదటి ప్రాధాన్యత ఓటు అన్నమాట. ఇలా వరుసగా 30 మందికి కూడా ఓటు వేయవచ్చు.. 50 శాతం ఓట్లు ఎవరికి వస్తే వారు గెలిచినట్లు లెక్క. మొదటి "ప్రాధాన్యత ఓట్లు 50% రాకపోతే సదరు వ్యక్తికి పడ్డ" ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు. అక్కడ 50 శాతం రాకపోతే మళ్లీ " ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు. ఇలా 50 శాతం ఓట్లు వచ్చేవరకు లెక్కిస్తారు 50 శాతం ఓట్లు వచ్చిన వారినే గెలిచినట్లుగా ప్రకటిస్తారు. ఓట్ల లెక్కంపులో ఈ ప్రాధాన్యత ముఖ్య పాత్ర వహిస్తుంది. ఎన్నికల ఫలితాలు ప్రకటించే సమయంలో ఫలానా, అభ్యర్ధి మొదటి లేదా రెండవ లేదా మూడవ ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించారు అని చెబుతారు కాబట్టి జాగ్రత్త గా మీ ఓటు హక్కు వినియోగించండి