సొసైటీ పై ఆసత్య ఆరోపణలు మానుకోవాలి : సోసైటీ చైర్మన్ కోటి సైదారెడ్డి.

Published: Friday August 20, 2021
పాలేరు ఆగస్టు 19 ప్రజాపాలన ప్రతినిధి : నేలకొండపల్లి సోసైటీ పై ఆ సత్య ఆరోపణ లు మానుకోవాలని సోసైటీ చైర్మన్ కోటి సైదారెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని సోసైటీ కార్యాలయం లో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నేలకొండపల్లి సోసైటీ పై గత కొంత కాలంగా కావాలనే తప్పడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సోసైటీ తీవ్ర నష్టాల్లో ఉన్నప్పటికీ లాభాల బాటలోకి నడిపించేందుకు పాలకవర్గం కృషి చేస్తుందని పేర్కొన్నారు. కానీ కొంత మంది కావాలనే ఆసత్య ఆరోపణలు చేస్తున్నారని, సొసైటీ ప్రతిష్ట ను దిగజార్చేందుకు పాటుపడుతున్నారని అన్నారు. సోసైటీ లో ఇచ్చిన ప్రతి రుణం సహాకార బైలా ప్రకారం ఇచ్చినవే అన్నారు. సోసైటీలో పేరుకపోయిన బకాయిలు వసూలు చేస్తున్న క్రమంలో కొంత మంది సోసైటీ పై బురద జల్లుతున్నారని అన్నారు. వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఆసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఇకనైనా తప్పుడు ప్రచారం మానుకోని సోసైటీ అభివృద్ధి పాటుపడాలని కోరారు