అంబేద్కర్ కు నివాళులు అర్పించిన ఈటెల
Published: Tuesday February 15, 2022
భారీ గా తరలివచ్చి ఘనస్వాగతం పలికిన బిజెపి శ్రేణులు.
జన్నారం రూరల్, ఫిబ్రవరి 14, ప్రజాపాలన: నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం గొడిసెర్యాల లోని రాజరాజేశ్వరి స్వామి ఆలయం పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతూ మాజీ మంత్రి ఈటల రాజేందర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహంకు పూలమాల వేసి నివాళులర్పించారు, అనంతరం మేదరి కులస్తులు తమపై పారెస్టు ఆఫీసర్లు దాడులు చేస్తున్నారని, తమని ఎస్టీ జాబితాలో చేర్చాలని, దీనిపై ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని మాజీ మంత్రి హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు వినతి పత్రం అందజేశారు. అంతకముందు తపాల పూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శివాలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన వెంట మాజీ ఎంపీలు వివేక వెంకటస్వామి, రమేష్ రాథోడ్, మంచిర్యాల జిల్లా బిజెపి అధ్యక్షుడు బిజెపి రఘునాథ్ వేరవేల్లి, జన్నారం మండలం బిజెపి అధ్యక్షుడు గోలి చందు, మండల బిజేపి కార్యదర్శి, ఎరుకల రమేష్ గౌడ్, నాయకులు జక్కుల సురేష్, కొంతం శంకరయ్య తదితరులున్నారు.
Share this on your social network: