ధరణి సమస్యల పరిష్కారానికి కృషి

Published: Tuesday March 29, 2022
వికారాబాద్, తాండూర్ రెవిన్యూ డివిజనల్ అధికారులు 
వికారాబాద్ బ్యూరో 28 మార్చి ప్రజాపాలన : ధరణి సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణికి ప్రజల నుండి భారీ స్పందన వస్తుందని వికారాబాద్, తాండూర్ రెవిన్యూ డివిజనల్ అధికారులు విజయకుమారి, అశోక్ కుమార్లు సంయుక్తంగా తెలిపారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 160 మంది ప్రజలు, తమ ధరణి సమస్యలకు సంబంధించి దరఖాస్తు చేయడం జరిగిందని వారన్నారు. ప్రజల నుండి  అందిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించెందుకు చర్యలు చేపట్టాలని తహసీల్దార్లను ఆదేశించారు.  ఇందులో అత్యధికంగా రెవెన్యూకు సంబందించిన దరఖాస్తులను ప్రాధాన్యతతో వెంటనే పరిష్కరించాలని సంబంధిత తహసీల్దార్లను వారు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి హరితహారం, అన్ని మండలాల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.