జోగన్ పల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన జువ్వాడి నర్సింగ్ రావు

Published: Monday January 30, 2023

కోరుట్ల, జనవరి 29 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల మండలం జోగన్ పల్లి గ్రామంలో శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి (శ్రీ రాజరాజేశ్వర స్వామి వేములవాడ దత్తత దేవాలయం) బ్రహ్మోత్సవం లో భాగంగా ఆదివారం రోజున స్వామి పుష్ప యాగం నాగవెల్లి కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు చేసి సప్తవరణాల కార్యక్రమంలో ఆలయంలో ప్రదక్షణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన  కోరుట్ల నియోజకవర్గ  కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావుకి ఆలయ కమిటీ సభ్యులు సన్మానం చేసి స్వామి వారి చిత్ర పటాన్ని అందజేశారు. అనంతరం జువ్వాడి నర్సింగ్ రావు  మాట్లాడుతూ కోరుట్ల నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో పాడిపంటలతో వృద్ధి చెందాలని స్వామివారిని కోరుకున్నానని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు అన్నారు  . వీరితోపాటు కోరుట్ల నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలేటి మహిపాల్ రెడ్డి,కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్,కాంగ్రెస్ సీనియర్ నాయకులు నక్క నర్సయ్య,తెలు రాములు, జోగన్ పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.