పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ
Published: Thursday June 10, 2021
మధిర, జూన్ 09, ప్రజాపాలన ప్రతినిధి : మునిసిపాలిటీరోజు మధిర లో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు, శ్రీ కొండపల్లి శ్రీధర్ రెడ్డి గారి సహకారంతో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగినది. కరోనా కష్ట కాలంలో పేదలకు సేవ హి సంఘటన్ పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా సహాయ సేవకార్యక్రమాలు కార్యకర్తలు నిర్వహించాలని తెలంగాణ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కొన్సిల్ సభ్యులు చిలివేరు సాంబశివరావు, మధిర పట్టణం అధ్యక్షులు పాపట్ల రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు కుంచం కృష్ణరావు, సీనియర్ బిజెపి నాయకులు రామిశెట్టి నాగేశ్వరావు, రామకృష్ణ, సాయి, నాగేంద్రబాబు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: