పల్లె ప్రగతితో మెరిసిన పల్లెలు

Published: Thursday February 03, 2022
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ 
వికారాబాద్ బ్యూరో 02 ఫిబ్రవరి ప్రజాపాలన : సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో ప్రతి పల్లెలో ప్రగతి వెల్లి విరుస్తుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కొనియాడారు. బుధవారం మర్పల్లి మండల పరిధిలోని సిరిపురం గ్రామంలో గ్రామ సర్పంచ్ ఎం.మల్లయ్య ఆధ్వర్యంలో మెయిన్ రోడ్ కు సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రారంభోత్సవం చేశారు. గ్రామస్తులందరూ సన్నాయి మేళంతో స్వాగతం పలికి, వికారాబాద్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా ఎమ్మెల్యేకు బంగారం (బెల్లం) తో తులాభారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి నెల గ్రామాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధికి తోడ్పడుతున్న సిఎం కెసిఆర్ అని అన్నారు. సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుతో గ్రామ ముఖచిత్రం మారుతుందన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి ముప్పై లక్షల రూపాయలు, మెయిన్ రోడ్ సెంట్రల్ లైటింగ్ కు ఇరవై లక్షల రూపాయలు కేటాయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.