బడ్డీ కోట్లను తొలగించి పేదల బతుకులు బజారున పడేసిన అధికార పార్టీసూరంసెట్టి కిషోర్
Published: Thursday April 14, 2022
మధిర ఏప్రిల్ 13న ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు మండల కాంగ్రెస్ అధ్యక్షులు వార్డు కౌన్సిలర్ కలిసి బడ్డీ కొట్టు తీయటం అధికారదాహంతో ప్రజల బతుకులు చెలగాటం ఆడటం అతిత్వరలోనే టైం దగ్గర పడుతోందని ప్రభుత్వం హెచ్చరిస్తూ పేద ప్రజలు జీవనాధారం కోసం బడ్డి కోట్లు పెట్టొకొని చిరు వ్యాపారం చేసుకుంటూ వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతుంటే, కనీసం ప్రత్యామ్నాయం చూపకుండా జెసిబి లు, క్రేన్లు, ట్రాక్టర్లతో యుద్ధవాతావరణం నెలకొల్పి పోలీసులతో దౌర్జన్యంగా, ప్రజలను భయాందోళనలకు గురి చేస్తూ బడ్డీ కోట్ల తొలగించటం హేయమైన చర్య.. మేము తొలగించుకుంటామ్ అంటే కూడా సమయం ఇవ్వకుండా బడ్డి కోట్లను పగులగొట్టి ట్రాక్టర్లలో వేసుకొని వెళ్తున్నారు దీనికి పూర్తిగా అధికార పార్టీ ఏ బాధ్యత వహించాల్సి ఉంటుందని మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరంసెట్టి కిషోర్అన్నారు.
Share this on your social network: