భారీవర్షాల దృశ్య ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ** జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ **

Published: Wednesday September 14, 2022
ఆసిఫాబాద్ జిల్లా సెప్టెంబర్ 12 (ప్రజాపాలన, ప్రతినిధి) : రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు రానున్న రెండు మూడు రోజులు ఉండడంతో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పి కే సురేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులు, ప్రజలు, అత్యవసర పరిస్థితులలో మాత్రమే బయటికి వెళ్లాలని సూచించాలి. ఎవరైనా  ప్రవాహం లో ఉన్న వాగులు దాటే సాహసం చేయరాదని, మత్స్యకారులు వర్షాలు తగ్గిన తర్వాతనే చేపల వేటకు వెళ్లాలని సూచించారు. జిల్లా పోలీస్ మొత్తం అప్రమత్తంగా ఉందని, ప్రజలకు ఎలాంటి సహాయం కొరకైన వెంటనే డయల్ 100 కి కాల్ చేసి తెలియజేయాలని కోరారు.