బుద్వెల్ లో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన చెన్నయ్య
రాజేంద్రనగర్ బుద్వెల్ అంబేద్కర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆదివారం నాడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి. చెన్నయ్య. ఆల్ ఇండియా దళిత సంఘాల అధ్యక్షుడు జెపి. రాజు హాజరై అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.అనంతరం చెన్నయ్య మాట్లాడుతూ నేటి యువత అంబేద్కర్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆశయాలను అయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు.అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని కొందరు చూస్తున్నారని ఆ కుట్రను మన అందరం కలిసి ఐకమత్యంతో ఎదుర్కోవాలని మనవి చేశారు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నదని తెలియజేశారు. అనంతరం స్థానిక నేత కార్మికులు చెన్నయ్యను మరియు జె.పి. రాజును శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర జనరల్ సెక్రెటరీ మన్నె శ్రీధర్ రావు, దాసరి సత్యనారాయణ, బుద్వేల్ అంబేద్కర్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జనార్ధన్,వైస్ ప్రెసిడెంట్ శ్రీశైలం, విగ్రహ దాత సరికొండ లక్ష్మణరావు ,మల్లెపల్లి మల్లేష్ ప్రధాన కార్యదర్శి యువకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Share this on your social network: