పండుగలను సుఖశాంతులతో జరుపుకోవాలి

Published: Monday September 26, 2022
10వ వార్డు కౌన్సిలర్ ఆంగోత్ దేవి రెడ్యానాయక్

వికారాబాద్ బ్యూరో 25 సెప్టెంబర్ ప్రజా పాలన : పండుగ పబ్బాలను సుఖ కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో జరుపుకోవాలని వికారాబాద్ మునిసిపల్ 10వ వార్డ్ కౌన్సిలర్ ఆంగోతు దేవి రెడ్యా నాయక్ ఆకాంక్షించారు. ఆదివారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 10వ వార్డుకు సంబంధించిన బతుకమ్మ చీరలను కౌన్సివర్ ఆంగోత్ దేవి రెడ్యానాయక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ10వ వార్డుకు మొత్తం 780 బతుకమ్మ చీరలు రావాల్సి ఉందని తెలిపారు. 420 బతుకమ్మ చీరలు మాత్రమే వచ్చాయని ఆమె తెలిపారు. వచ్చిన బతుకమ్మ చీరలలో సుమారు 100 మందికి పంపిణీ చేశామని వివరించారు. పార్టీలకు అతీతంగా వచ్చిన బతుకమ్మ చీరలను అందరికీ పంపిణీ చేయనున్నామని స్పష్టం చేశారు. ప్రతి పండుగను ప్రజలందరూ సుఖ సంతోషాలతో పిల్లాపాపలతో హాయిగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. వార్డులో ఏ సమస్యలు ఉన్నా నా దృష్టికి తేవాలని విజ్ఞప్తి చేశారు. పదవవాడు అభివృద్ధికి నా శాయశక్తుల కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. వార్డు అభివృద్ధి నా లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రెడ్యానాయక్ యు అనంతయ్య యు బాగయ్య కురువ లక్ష్మయ్య నాగేష్ శేఖర్ ఆనంద్ కుమార్ రాజు నాయక్ తదితర పదో వార్డ్ కౌన్సిలర్ ప్రజలు పాల్గొన్నారు.