మృతుడి కుటుంబానికి అండగా మాదాపూర్ యూత్ సభ్యులు, గ్రామ ప్రజలు

Published: Wednesday August 11, 2021
కోరుట్ల, ఆగష్టు 10 (ప్రజాపాలన ప్రతినిధి) : మాదాపూర్ గ్రామానికి చెందిన దువ్వాక సంజీవ్ ఇటీవలే మరణించినందున వారి కుటుంబానికి అండగా నిలవాలని గ్రామంలోని ఆదర్శ్ యూత్ మరియు గ్రామ ప్రజలు నిర్ణయించుకొని వారి కుటుంబంలోని మృతుడి భార్యకి, పిల్లల పోషణ గురించి నిమిత్తం 5,00,000/- అక్షరాల ఐదు లక్షల రూపాయలు మరియు తల్లి దండ్రులు పోషణ నిమిత్తం చేయూత కోసం 85,000/- అక్షరాల ఎనబై ఐదు వేల రూపాయలను గ్రామ సర్పంచ్ దారిషేట్టి రాజేష్ చేతుల మీదుగా ఆదర్శ యూత్ సభ్యుల మరియు గ్రామ ప్రజల తరుపున అందజేశారు. మృతుడి కుటుంబ సభ్యులు ఆదర్శ్ యూత్ సభ్యులకు, గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీటీసీ చేపురి కృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ గడ్డం మల్లారెడ్డి, సింగిల్ విండో ఛైర్మెన్ గడ్డం ఆదిరెడ్డి పాల్గొన్నారు.