క్షౌర వృత్తిదారుల దినోత్సవం
Published: Saturday September 17, 2022
జన్నారం, సెప్టెంబర్ 16, ప్రజాపాలన: ప్రపంచ క్షౌర వృత్తిదారుల దినోత్సవం పునస్కారించుకోని ధనువంథరీ విగ్రహము పోటోతో మండల అధ్యక్షుడు కస్తులపూరి నాగేందర్ నాయి తెలియజేశారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో మాట్లాడుతూ నాయి బ్రహ్మణ వృత్తిని నమ్ముకొని జీవనం కొనసాగిస్తూన్నామని అయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్షౌర వృత్తిదారులను అదుకోట్టామని మరచిపోయిందన్నారు. నాయి బ్రహ్మన వృత్తిదారులకు పూర్తి సహకారం చేయడం జరుగుతలేదని అవేదన వ్యక్త పరచారు. ఇప్పటికైనా క్షౌర వృత్తిదారులకు ప్రభుత్వం ద్వారా సబ్సిడీ, సెలవు దినాలు, తదితర వాటిలో మాకు న్యాయము చేయాలని కోరారు. ఈ కార్యాక్రమంలో ప్రధాన కార్యదర్శి మర్రిపల్లి శేఖర్, మండల నాయి బ్రహ్మణ సంఘం సభ్యులు నరేందర్, రమణ, గంగన్న, సత్యం, రాజేష్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: