బోడుప్పల్లో శిధిలావస్థలో ఉన్న భవనాలు కూల్చివేత
Published: Thursday July 08, 2021
మేడిపల్లి, జులై 7 (ప్రజాపాలన ప్రతినిధి) : బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ అధికారులతో కలిసి మేయర్ సామల బుచ్చిరెడ్డి 27వ డివిజన్లో శిథిలావస్థలో ఉన్న పాత భవనాలను జెసిబి సహాయంతో కూల్చివేశారు. వర్షాకాలంలో గానీ మరే ఇతర కారణంగా గానీ శిధిలావస్థలో ఉన్న పాత భవనాలు కూలి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా కూల్చి వేస్తున్నామని మేయర్ సామల బుచ్చిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో టిపిఒ అలిపాశ, డి ఈ కుర్మయ్య, మేనేజర్ సురేష్ రెడ్డి, ఆర్ ఐ వెంకటేష్ మరియు 27వ డివిజన్ యువనాయకులు శ్రీధర్ గౌడ్ పాల్గొన్నారు.
Share this on your social network: