"ఒకేషనల్ ప్రాక్టికల్స్ పకడ్బందీగా నిర్వహించాలి"

Published: Friday December 03, 2021
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి డిసెంబర్ 02, ప్రజాపాలన : జిల్లాలో నేడు 3వ తేదీ నుండి జరిగి ఒకేషనల్ ప్రథమ సంవత్సరం పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా మాధ్యమిక విద్య అధికారి (డిఐఈఓ) శ్రీధర్ సుమన్ ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం జిల్లాలోని 8 ప్రయోగ పరీక్షల నిర్వాహకులకు "ఆన్ లైన్"(జూన్ మీటింగ్) ద్వారా పలు సూచనలు జారీ చేశారు. ఇంటర్మీడియట్ ఓల్డ్ నియమ నిబంధనల మేరకు జిల్లాలో ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు సజావుగా నిర్వహించాలన్నారు. విద్యార్థులకు రికార్డులు, సిలబస్, ప్రశ్నాపత్ర నమూనాల గుర్తించి తగు అవగాహన కల్పించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 8 కళాశాలలో 887 మంది విద్యార్థులకు ఈ పరీక్షలు ఉంటాయని, విద్యార్థులు వెంటనే సంబంధిత ప్రిన్స్ పాళ్లను, అధ్యాపకులను సంప్రదించాలని తెలిపారు.