రంజాన్ తోఫాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

Published: Tuesday May 04, 2021

పటాన్ చేరు, మే 3, ప్రజాపాలన ప్రతినిధి : పటాన్ చేరు పట్టణంలోని చిన్న మసీదులో నిరుపేద ముస్లిం కుటుంబాలకు పటాన్ చేరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి రంజాన్ తోఫా ప్యాక్ లను పంపిణీ చేశారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ఈ కరోనా కాలంలో కూడా సంక్షేమ పథకాల అమలు చేయడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడ వేనుకడుగు వెయ్యలేదని, అందులో భాగంగా ముస్లిం మైనార్టీలకు రంజాన్ తోఫా ప్యాక్ లు అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు..