C. M రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

Published: Wednesday June 16, 2021
మధిర, జూన్ 15, ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ రామకృష్ణఅనారోగ్యంతో బాధపడుతూ వివిధ హాస్పిటల్స్ నందు చికిత్స పొందిన అనంతరం అక్కడ అయిన ఖర్చును తమ కుటుంబ ఆర్దిక పరిస్థితులు దృష్ట్యా సీఎం సహాయ నిధి నుండి ఆర్దిక సహాయం అందించాలని కోరుతూ. మధిర శ్యాసన సభ్యులు మల్లుభట్టి విక్రమార్కద్వారా దరఖాస్తు చేసుకోగా  మల్లుభట్టి విక్రమార్క గారి సిఫార్సు మేరకు సీఎం సహాయ నిధి నుండి చెక్కు మంజూరు అయింది. కాగా అట్టి చెక్కును ఈ రోజు మధిర మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సూరం శెట్టి కిశోర్, మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిరియాల రమణ గుప్తా చేతుల మీదుగా అందించటం జరిగింది, P రామకృష్ణ మధిర. 60,000 rs చెక్ వారికిఅందించటం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చవా వేణు, మధిర మండల sc సెల్ అధ్యక్షులు దారా బాలరాజు, మధిర మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అద్దంకి రవి, మాజీ సర్పంచలు కర్నాటి రామారావు, బొమ్మకంటి హరిబాబు, మండల intuc అధ్యక్షులు కోరంపల్లి చంటి, టౌన్ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ జహంగీర్, కాంగ్రెస్ నాయకులు ముస్లిం వెల్ఫేయిర్ కమిటీ అధ్యక్షులు మొహమ్మద్ అలీ మైలవరపు చక్రి, మొదలగు వారు పాల్గొన్నారు