నేటి బంద్ ను జయప్రదం చేయండి

Published: Monday September 27, 2021
ఎర్రుపాలెం ప్రజాపాలన ప్రతినిధి సెప్టెంబర్ 25వ తేదీ: దేశ వ్యాప్త బంద్ ను జయప్రదం చేయండి, అఖిల పక్షాల నాయకులు, ఎర్రుపాలెం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా అఖిలపక్షం ఆధ్వర్యంలో నిర్వహించే భారత్ బంద్ ను విజయవంతం చేయాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి దివ్వెల వీరయ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు దో మందుల సామేలు మండల ప్రజలను కోరారు. మండల కేంద్రమైన ఎర్రుపాలెం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ, కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ ప్రైవేటు పరం చేస్తుందని. దేశానికి వెన్నుముక అయినటువంటి వ్యవసాయ రంగంలో కూడా ప్రైవేట్ కంపెనీలను ఆహ్వానిస్తూ తీసుకువచ్చిన మూడు నల్ల చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ నిత్యావసర సరుకుల ధరలను తక్షణమే తగ్గించాలని తలపెట్టిన భారత్ బంద్ ను ప్రజలంతా సహకరించి స్వచ్ఛందంగా పెరుగుతున్న ధరలకు వ్యతిరేకంగా, వ్యవసాయ రంగంలో తీసుకొచ్చినటు వంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఈ బంద్ ను విజయవంతం చేయాలని కోరారు.