మొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

Published: Tuesday June 22, 2021
గ్రామాధివృద్ది లో భాగంగా నర్సరీని పరిశీలించిన ఆర్డీవో వినోద్ కుమార్
మల్లాపూర్, జూన్ 21 ( ప్రజాపాలన ప్రతినిధి) : హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలని మెట్ పల్లి ఆర్డీవో వినోద్ కుమార్ అన్నారు. సోమవారం మల్లాపూర్ మండలంలోని నడికుడ, ఓబులపూర్, మొగిలిపేట్ గ్రామలలో గ్రామ అధివృద్దితో సాగుతున్న పనులను పరిశీలించడానికి వచ్చిన ఆయన నర్సరీని, రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటడానికి స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఉపాధి హామీ కూలీలు 
మొక్కలు నాటేందుకు తీసిన గుంతలను పరిశీలించారు. ఓబులపూర్ గ్రామంలో గ్రామ అధివృద్ది పనుల గురించి గ్రామ సెక్రెటరీ సాధన్ ఫిర్ డోస్ ను అడిగి తెలుసుకొని తగిన సూచనలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏంపీడీవో రాజా శ్రీనివాస్, ఏపీవో సతీష్, సర్పంచులు వంతడుపుల నాగరాజు, అలిశెట్టి రవి, భూక్య రుక్మ, గ్రామ కార్యదర్శులు సరిత, సౌజన్య తదితరులు పాల్గొన్నారు.