చత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్టాపనకు విరాళం అందజేత
Published: Friday February 03, 2023
జన్నారం, పిబ్రవరి 02, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్ గ్రామంలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన కొరకు ఖానాపూర్ నియోజకవర్గ యువ నాయకులు పూర్ణచందర్ నాయక్ పదివేల రూపాయలు విరాళం అందజేశారు. అదేవిధంగా జన్నారం జడ్పిటిసి ఎర్ర చంద్రశేఖర్ ఐదు వేల రూపాయలు అందజేస్తూ, శివాజీ విగ్రహ స్థాపన కోసం తమ వంతు సహకారం అందిస్తామన్నారు. కవ్వాల్ ఛత్రపతి శివాజీ సభ్యులు విరాళం అందజేశిన వీరిని చత్రపతి శివాజీ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు. అదేవిధంగా హిందూ వాహిని మండల కమిటీ సభ్యులు, బిజెపి మండల నాయకులు విరాళం అందజేసిన పలువురుని అభినందించారు. రాతలు ఎవరైనా ఉంటే విగ్రహ ప్రతిష్టాపన కొరకు విరాళం అందజేయాలని కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని కమిటీ సభ్యులు, మండల బిజెపి నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: