పట్టణంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

Published: Thursday March 09, 2023
రాయికల్, మార్చి 08 (ప్రజాపాలన ప్రతినిధి):
రాయికల్ పట్టణ కేంద్రంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో మరియు పట్టణకేంద్రంలో భారతీయజనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి నివాసంలోను, కాంగ్రెస్ పార్టీ రాయికల్ మహిళా విభాగం ఆధ్వర్యంలో స్థానిక వి.ఎస్. గార్డెన్ లో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలలో పురపాలక సంఘం రాయికల్, రాజకీయ పార్టీల మహిళా మోర్చా నాయకులు పారిశుద్ధ్యకార్మికులను శాలువాలతో ఘనంగా సన్మానం చేసారు. ఆర్పీలకు , వివిధ క్షేత్రాలలో పనిచేసి ప్రతిభ కనబరిచిన మహిళలకు ఉత్తమ మహిళలుగా పేర్కొంటూ చీరలు పంపిణీ చేసి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ హనుమాన్లు మాట్లాడుతూ మహిళలు వివిధ రంగాలలో రాణిస్తూ అభివృద్ధి సాధిస్తున్నారని తెలిపారు. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నాయకురాలు డాక్టర్ బోగస్ శ్రావణి మాట్లాడుతూ ప్రతి స్త్రీ ఒక ఆదిశక్తి అని ఆడవాళ్ళ ఎందులో తక్కువ కాదని ప్రతి రంగంలో ఆడవాళ్లు మగవారితో పాటు సమానంగా పోటీ పడుతున్నారని, స్త్రీలను గౌరవించడం మన భారతీయ సంస్కృతిఅని, మహిళలను అణిచివేసే ప్రయత్నం చేయకూడదని నేటి సమాజంలో స్త్రీ సమానత్వం ఎన్నో మార్పులకు వేదికైందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ హనుమాన్లు, కమిషనర్ సంతోష్ కుమార్ కౌన్సిలర్లులు, మహిళా సంఘ సభ్యులు, కార్యాలయ సిబ్బంది, భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, భీమనాతి ఉమాదేవి శంకర్, ముదిగంటి ఉమాదేవి రవీందర్ రెడ్డి, సునంద, మామిడాలశోభారాణి, వందన సామల అంజలి, పట్టణకాంగ్రెస్ నాయకురాళ్లు మమత,అనురాధ మహిళలు తదితరులు పాల్గొన్నారు.