మంత్రి మల్లారెడ్డికి విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్లు కో ఆప్షన్ సభ్యులు
Published: Monday October 18, 2021
మేడిపల్లి, అక్టోబర్ 17 (ప్రజాపాలన ప్రతినిధి) : దసరా పండుగను పురస్కరించుకొని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు కొత్త చందర్ గౌడ్, బింగి జంగయ్య యాదవ్, కో ఆప్షన్ సభ్యులు రంగా బ్రాహ్మణ గౌడ్ లు కార్మికశాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డిని మరియు మల్కాజ్గిరి పార్లమెంట్ టీఆర్ఎస్ ఇంచార్జి మర్రి రాజశేఖర్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకేతో, పట్టు శాలువాతో సత్కరించి వారికి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.
Share this on your social network: