జిల్లా బీసీ నూతన ఉపాధ్యక్షులుగా పాలోజి సత్యం నియామకం

Published: Wednesday July 28, 2021

జగిత్యాల, జులై 27 (ప్రజాపాలన ప్రతినిధి): జిల్లా తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు పాలోజి సత్యం  జిల్లా ఉపాధ్యక్షులుగా నియమించారు. ఈ సందర్భంగా పాలోజి సత్యం మాట్లాడుతూ  నియామకానికి సహకరించిన బీసీ అన్నికుల, సంక్షేమ సంఘాల నాయకులకు ధన్యవాదములు తెలియజేశారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి బీసీ సంక్షేమ సంఘం అభివృద్ధికి ఎల్లవేళల కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు గాజుల నాగరాజు, బీసీ సర్పంచ్ ల ఫోరం జిల్లా అధ్యక్షులు సామంతుల ప్రభాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పోతంశెట్టి సతీష్ రాజు, కార్యదర్శి ఓరుగంటి భార్గవ్ రామ్, మానాల కిషన్, ఆకుల నాగరాజు, గుగ్గిళ్ళ సత్యనారాయణ, పెండెంచిన్న గంగాధర్, జిల్లా బీసీ యువజన సంఘం అధ్యక్షులు బ్రహ్మాండబేరి నరేష్, ప్రధాన కార్యదర్శి ఎనగంటి రవికుమార్, బోరుగల్ల దేవయ్య, పెండెం చిన్న గంగాధర్ పాల్గొన్నారు.