ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి

Published: Wednesday October 06, 2021
ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 5, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం, అక్టోబర్ తేదీ 5 ప్రజా పాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం తులేకలన్ గ్రామ సర్పంచ్ చిలుకల యాదగిరి  సూచనల మేరకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో  కోవిడ్ టీకాల కార్యక్రమం మంగళవారం నిర్వహించడం జరిగింది. ఒకరికొకరు కలిసి కట్టుగా 100% వ్యాక్సినేషన్  పూర్తి చేయాలనే సంకల్పంతో గ్రామంలో ముమ్మరంగా వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్నామన్నారు. కరోనా వ్యాప్తికట్టడి లో భాగంగా 100 మందికి పైగా గ్రామప్రజలకు టీకాలు వేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం ఏం.అమృత, ఆశ వర్కర్ విజయ,  పంచాయతీ సెక్రటరీ సాయి కారోబార్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.